8, మార్చి 2009, ఆదివారం

భాషా నిధనం ...సుస్వాగతం

మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమం
.. సుస్వాగతం ..
రచన :నూతక్కి రాఘవెంద్ర రవు.
తెది 04-03-2009


ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషి , మానవ సమాజంలొ పెరిగే ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్నిచుకుపొయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు ,ఆ జాతి జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.

సమాజానికి సంస్క్రుతి ,సంప్రదాయాలు ,రెందు నిట్టాళ్ళ లాటివివైతె .నీతి,నైపున్యం, నిబధత,ఆకాంక్ష అన్నవి నాలుగు మూల స్థభాలు. యీ భూమి పై మానవుడు సుఖంగ బ్రతకడానికి ముఖ్యంగ కావలసినవి,తింటానికి తిండి,కట్టుకోంద్కూ బట్ట,ఎండ, వానల నుంచి, జంతు జాలం నుంచి,రక్షణకై గూడు ,ఒకరి నుంచి ఒకరు అబిప్రాయాలు తెలుసుకొవడానికి సంకేతాలు ,సంకేతాలనుండి చేతి సఙ్గ్నలు,శబ్ద సంకేతాలు,ఆ శబ్ద సంకేతాలనుండి పదాలు,వాటి ద్వారా వాక్యాలు ,తద్వారా అక్షరాలు,మాటలు ,భాష,సంభాషణ,అక్కడితొ ఆగకుండా ,వ్రాత,రచన, సాహిత్యం,....ఆ విధంగా ,ఒక జాతి సంస్కృతి పై భాష,చాలా ప్రముఖ పాత్ర పొషిస్తుంది .

భాష సమాజాన్ని శాసిస్తుంది,భాష సమాజాన్ని పాలిస్తుంది, భాష సమాజాన్ని నియంత్రిస్తుంది ,భాష సమాజాన్ని బుజ్జగిస్తుంది,భాష సమాజాన్ని ప్రశ్నిస్తుంది,భాషే ప్రపంచాన్ని చూపిస్తుంది, వినిపిస్తుంది,ఆలోచింప చేస్తుంది .

భాష మానవునికి వున్న మహాధ్భుత వరం ,సౌకర్యం,మరి యే యితర జీవ రాశికి లేదన్న వాస్థవం మనందరకు తెలిసిన విషయమె,భాష పై అధి కారం సాధించిన వాళ్ళ్లు యే రంగంలోనయినా తమ దంటూ ఒక ప్రత్యేక స్థానం పొందగలుగుతారు.యే భాష పైనైనా అధికారం పొందగలిగిన వాడు తన మాత్రు భాషపై గొప్ప చాతుర్యం వున్న వాడై వుంటాడు.లెదా అదె భాషలొ బాల్యం నుంచి సాధన చేసైనా వుండి వుండాలి.

కాబట్టి మాత్రు భాషలొ ప్రావీన్యం వున్న తరువాతనె యే యితర భాషలయినా నేర్చు కొవచ్చు.అభిమానించ వచ్చు .జీవన అవసరార్థం వినియొగించుకొవచ్చు.మాత్రు భాష అంటె మాటొ వ్రాతో ఒక్కటొ,రెందో కాదు, సంప్రదాయానికి , సంస్క్రుతికి అనుసంధానించబడిన ఒక మహత్తర ప్రక్రియ.
మాత్రు భాష అలవడలేదంటే, ఆ సమాజంతో ఆమనిషికి సంపర్కం లేదన్న మాటె. అంతగా భాషా,సంప్రదాయం, సంస్క్రుతి, జీవన విధాన్నాల్లో ముప్పిరిగా పెన వెసుకు పోయి వుంటాయి.

తమ తమ సంస్క్రుతి సంప్రదాయాలు,సామాజిక విధి విధానాలు,తర తరాలకు అందించే భాధ్యత ఆ సమాజంలొ జన్మించిన ప్రతి ఒక్కరిది.దానికై సమాజంలొ గట్టి అనుబంధం అవసరం. ఆ అంబంధం ఆ సమాజంతొ యెవరూ విదదీయ లేరు.
అప్పుడే మాత్రు భాషపై పట్టు కలుగుతుంది ,సంస్క్రుతి సంప్రదాయాల యడల భక్తి కలుగుతుంది.తనకంటూ జీవన యానంలొ ఒక వునికి యేర్పడుతుంది. ఒక వ్యక్తిత్వం యెర్పదుతుంది.
యీ రొజున మాత్రు భాషాభిమానం ప్రజజీవనంలొ తరిగి పొతున్నదని పొలి కేకలు పెట్టే వాళ్ళే గాని,దానికి మూల కారణ మేమై వుంటుందన్న విషయమై ఆలొచించారా ఎన్నడయినా?

ఖుక్షి యనె రెందక్షరాల జీవ జాల యంత్రాంగం, మానవ జాతిని శాసిస్తున్నప్పుదు ,దాని అవసరాలు తీర్చే ప్రక్రియలొ మానవుడు యెన్నొ యెన్నెన్నొ
యత్నాలు, సాధనలు చేస్తూనే వుంటాడు.ఆకలి, పేదరికం, క్షుధ్భాధ వాటినివారనోపాయం వెదికే యత్నంలొ వుత్పాదితమయిన పరభాషా వ్యామొహాలు.అందునుంచి వుధ్భవించినవే భారత దేశంలో పరమత అభిమానాలు. అధికార యంత్రాంగాలు, తమ అధికారం నిలుపుకొనేందుకు చేసె మంత్రాంగాలు ప్రక్కన బెట్టి యీ సమస్యా మూలాల గూర్చి ఆలొచిస్థే పరిష్కారానికి మూలం తెలుసుకొని ఆ కోణంనుంచి సామాన్యలకు వుపశమనం దొరికినప్పుడు, అప్పుడు వాళ్ళు మాత్రు భాషపై ద్రుష్టి మరల్చె అవకాసం వుంటుంది.

ఆదీ కాకుందా చాందస భావాల మధ్య ,చందొ బధ్ధ బంధనాలలొ భాష యెప్పుడొ బందీ అయిపొయింది. ధనవంతులు,విద్యా వంతులు యే ప్రాంతంలొని వారయినా మాత్రు భాష మాట్లాడటమే తప్పుగా భావించడం ప్రారంభమయి యెన్నో దశాబ్దాలయి పొయింది.

ఇక యే పండితు డయినా ఆయా ప్రాంతాలలొ మాత్రు భాషను వెదకాలంటె ఆ మహా రాజ పొషకులు,భాషామ తల్లికి ముడ్డు బిడ్డలు వారే వారే, పేదలు నిరుపేదలు, సామాన్యులు,చదువు కోనివారు చదువుకొన లేని వారు,గుడిసెల్లొ , రొడ్లవెంబడి,కాలవ గట్లన మురికివాదలొ, ఎక్కడ బడితె అక్కడ వారె.... ,వారికి మాత్రు భాష తప్ప మరే భాషా రాదు. వారు మాత్రు భాషా ద్రొహం చేయలేరు.వారికి పేదరికం లో కొట్టు మిట్టాడటమే తెలుసు.వారే దేశం లో అత్యధికులు. వారి వల్లనే భారత దేశంలొ ఆయా మాత్రు భాషలు బ్రదుకు నీడుస్తున్నాయి.


ఆయ్యా! మాత్రు భాషాభి మ్రానుల్లారా,భాషా పందిత ప్రవరాఖ్యుల్లారా,భాషా ఛాందస వాద కుయుక్తుల్లారా......

ఒహొ ఇందులొ మీదే కద ప్రధమ భాగం ఒ రజకీయులారా ....
వొటే మీ భాష ఒటే మీ మాట ఒటే మీ బ్రతుకు ఒటే మీ ఉశ్చం
నీచం,ఒటే మీ తుస్చ జీవనం.అయినా ఆఆ భాషలొనే పుత్తి, ఆ భాషా జన జీవనాల బక్షిస్తూ బ్రథికేసే రాజకీయ ......విష చత్ర చాయలో... .


మాత్రు భాషా నిధనానికై ప్రతిగ్న చేసినట్లున్నాయి ప్రభుత్వాలు .
ఖాల్మొక్త బాంచ్న్ దొరా
మేమే బాబూ బాస బతికించేది,
మాకూ తిండి ,బాబూ మాకూ బట్ట,
బాబూ మాకూ గూడూ...
మాకూ సదువు,మాకూ జీతం.
బత్తెం ఇచ్చెయ్యండయ్యొ
నీ కాల్మొక్తా బాంచెన్ దొరా,
మేమూ ఇంగిలిపీసే మాత్తాడేత్తామయ్యా,
నీ కాల్మొక్తా బాంచన్ దొరా!
మాత్రు బాసను సంపేద్దామండయ్యొ
నీకాల్మొక్తా బాంచన్ దొరా..

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.dt04-03-2009,

కామెంట్‌లు లేవు: