11, ఫిబ్రవరి 2009, బుధవారం

సత్తిగాడి కబుర్లు ...ఒకటో పేజి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ,పొగడరా నీ జాతి నిండు గౌరవము. చిన్నప్పటి నుంచి పోగుడుతున్నాం.పోగుడుతాం,ఇక ముందు కూడా పొగుడుతూనే వుంటాం. అది ఒక పౌరుడిగా మన కర్తవ్యమ్ .విదేశాల్లో మన దేశం గురించి , మన లోటు బాట్లు తప్పులు లోపాలు గురించి మాట్లాడకుండా అంతా మంచే మాట్లాడుకుందాం.చాలా గొప్పగానే చెప్పుకుందాం. బాగుంది. ప్రచార సాధనాల ద్వారా కూడా అట్లాగే ప్రచారం చేయమని వత్తిడి తెద్దాం. అది ఇంకా బాగున్నది. అది అంతా అనుకున్నట్లే జరిగి విదేశాలన్నీ మనల్ని గొప్పగా అనుకుంటున్నాయి సరే . అదీ బాగుంది.
మరి మనదేశం లోపల మన సంగతే మిటీ? మన దేశం అంటే వుట్టి దేశమేనా ?ఆ పెద్దాయన ఏదో... అన్నాడే ..ఆఎమన్నా..ఆ .. ఆ ...డబ్బా ....ఆ ....దేశమంటే మనుషులోయ్ !అన్నాడు. అంటే మనుషులంటే దేశమనే కదా అర్థం. ఆయనన్నాడు కాబట్టి ఒప్పు కుందాం.అంటే ఆయన చెప్పినట్టు చచ్చినట్టు మనం ఒప్పుకున్టున్నామనమాట.'యామైనా గొప్పోల్లు సాన గొప్పగనె సేబుతారండి' అంటాడు మా సత్తి గాడు.వాడు తక్కువగా అనుకుంటున్నారేమో .చాలా తప్పులో కాలేసినట్లే మీరు .మాస్టారూ ! ఆ సత్తిగాడి కబుర్లు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది .వాడి గురించి తరవాత మాట్లాడుకుంటే పోలా ,అయినా యెంత తక్కువగా మాట్లాడు కొంటె అంత మంచిది . మనం రేపు మాట్లాడు కుందాం .శలవిప్పించండి.
తేది:బుధవారం,పదకొండో తేది, ౨౦౦౯.రచన :నూతక్కి రాఘవేంద్ర రావు .

కామెంట్‌లు లేవు: