22, జనవరి 2019, మంగళవారం

గప్పటి దినాల ముచ్చట్లు


గా దినాల్ల అయిదరాబాద్ ఆర్ టి సి బస్సుల మినిముం టికెట్ ఏడు పైసలే . సికింద్రాబాద్ కెళ్ళి లాలాపేట శాంతి నగర్ మినిమం పోవచ్చు. జేబిలో పైసలుంటే గుండె నిండ ధైర్యం .ఫుల్ ధైర్యంతో ధీమాగా నడుస్తున్న. మరి నా కాడ నలభై అయిదు పైసలున్నై మరి .అవనీకి నాకాడ రూపాయుండే.గానీ గా కీసర పోరడు కనపడకుంటే మంచిగనే వుంటుండే.గాడు సేయబట్టి యాభై అయిదు పైసలయిపోయినై వుత్త పున్నేనికి.గాంధీ ఆస్పతల్ మూలకఛ్చిన .ఆల్ఫా ల చాయ్ తాగాలనంటే ఎట్లైనా పది పైసళ్ళ ఆఫ్ కప్పొస్తాది .రెండు బి స్కోట్లు ఇంకో పది పైసలైతయ్.ఇంకాభీ ఎనభై పైసలుంటవి . పది పైసళ్ళ శాంతినగర్ పోవచ్చు     అనుకుంట జరా ముందుకు అడుగేసిన .ఇంతలా ఎనిక్కెల్లి     అన్నా సానది నాలాయే నిన్ను సూడబట్టి ,గిదేంది శానా బక్కగైనవ్ అనుకుంట ఎనిక్కెళ్ళి బుజం మీన సెయ్యేసిండు .తిరిగి సూద్దు ను గంద  గా కీసర పోరడు . ఎట్లున్నవ్  తమ్మి అంట మంచిగున్నర ! అవ్ తమ్మి సానదీనాలాయే సూడబట్టి అనుకుంట ...గింతల ఆల్ఫా హోటల్ తానకు జేరుంటిమి .తమ్మి చాయ్ తాగుతవ అన్నపెద్ద పైసలున్నోనిలెక్క  . తా పితే తాగుతా సార్ అన్నడు . రెండాఫ్ లు ఇరవై పైసలైతది .సరే అనుకున్న .తమ్మీ రెండు  ఆఫ్ ఛాయియ్యి బేరకి చెప్పిన చాయ్ సెక్షన్ రోడ్డుమీకి ఉండే . సారూ నాలుగు బైస్కోట్లు తెప్పియ్ .చస్తమా ఆర్దారిచ్చ్చిన .తిన్నం  తాగినం.యాభై అయిదు పైసల్ బిల్లు .అన్నా కాల్మొక్త కీసర పోనీకి పైసల్ తక్వ పడినయ్ ఓ కారణా బుడ్డ  పావలా ఉంటి య్యరాదే. .ఏంజెయ్యాలె  తీసిచ్చిన .ఆడు పోయిండు . ఇరవై పైసల్ జేబీల ఉన్నాయ్ గదా  అనుకుంట   నేను పోయి మౌలాలి బస్సు కదులుతుంటే ఎక్కినుంటి .టికెట్ టికెట్ కండక్టర్ అచ్చిండు  ఘమండు గా  జేబీల చెయ్యిపెట్టి న పైసల్ లెవ్ . ఎంత ఎడికినగాని దొరకలే .కండక్టర్ బెల్ కొట్టిండు .ఉతరో .ఉతరక జస్థనా ! ఉతరి నా . లాలాపేటదిక్కు లెఫ్ట్ రైటు . ఇంతకీ పైసలేమైనట్టూ ...సొంచాయించుకుంటా నడుస్తున్న .అయ్యా ధర్మం చెయ్యి దొ రా కాల్మొక్తా .బీచ్చ్గగా డు .బల్బు వెలిగింది . ఇరవై పైసల బిళ్ళ బీచ్చ్గానికిచ్చ్చినం గదా గాంధీ ఆస్పటాలు మూలమీ న యాద  మరిసిన. హమ్మయ్య లెక్కతేలింది .గుండె తేలికపడింది.హుషారుగా నా నడక సాగింది .



26, ఏప్రిల్ 2010, సోమవారం


చీకటిలో వెలుగు

24, ఏప్రిల్ 2010, శనివారం

కాక తాళీయంగా మువ్వురు ప్రముఖులతో యీ సాయంత్రం ....

ఈ రోజు నాకు ప్రముఖ చిత్రకారుడు "శ్రీ బాలి ని" కలిసే ఆవకాశం కలిగింది.ఆయన కార్టూనిస్తే కాదు మంచి కధా రచయిత అని వారిని కలిసినపుడే తెలిసింది. ,చక్కని గాయాకుడని వారు పాట పాడి వినిపించినపుడు తెలిసింది.రేఖల్లో ఆయన గిసిన చిత్రాలు చూసి అబ్బురపడిన రోజులున్నాయి.అనుకోకుండా ముఖతహా వారిని కలిసే ఆవకాశం వచ్చినప్పుడు అబ్బురమనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి ?
యీ సాయంత్రం వాకింగ్ కు వెళదామని ఇంటి బయటికి వస్తూ వుంటే పులిగడ్డ విశ్వనాధ రావు గారూ ,పురాణం శ్రీనివాస శర్మ గారూ ఎదురొచ్చారు. మీరు బయటకు వెలుతున్నారేమిటి ? బాలిగారు వస్తున్నారు. మిమ్మల్ని పిలుద్దామని వచ్చామని చెప్పారు. వెంటనే నా వ్యాహ్యాళి వాయిదా పడింది.బాలిగారిని కలిసే ఆవకాశం కలిగింది.
థాంక్స్ టు పులిగడ్డ వారు, థాంక్స్ టు పురాణం గారు. శ్రీ పురాణం ......వీరు స్వర్గీయ శ్రీ పురాణం సుభ్రహ్మన్యసర్మగారి పుత్రులుస్వతహా రచయిత ,ప్రముఖ పాత్రికేయులు.

యీ సందర్భంగా పులిగడ్డ వారిని గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. తెలుగులో హాస్యకధలు వ్రాయడంలో వారికి వారే సాటి.వారి కధా సంకలనం కలియుగ కృష్ణార్జునులు గురించి మునిపల్లె రాజు గారు అంటారూ ,...యీ సిద్ధహస్తుడి హాస్య రచనలో విడదీయలేని తాలింపు పదార్ధాలు...వక్రోక్తి,అతిశయోక్తి, శ్లేష ,హేళన,లక్ష్యాన్ని గురి తప్పకుండా చేరే మహా ఘాటు శర పరంపరలు అంటారు. .

కాక తాళీయంగా యీ సాయంత్రం

1, అక్టోబర్ 2009, గురువారం

తొట్రుపాటు

తొట్రుపాటు
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు
తేది:27-09-2009
కాబోలది గగురుపాటు
కాబోలును జలదరింపు
కాబోలును కాబోలును
ఆ తనువున పులకరింపు
యుగ యుగాల నిద్ర నుంచి
ఆవులించి వళ్ళువిరచి
మత్తు మత్తుగా
మరల పవ్వళించినట్లు
అదియంతా క్షణకాలపు
ఆ నిద్దురలేని చేష్ట
కాలపురుష ప్రియుడిచ్చిన
ఆనందపు అనుభూతులు
హ్రుదికొనలో రగిలించిన
తొట్రు పాటుకావచ్చును

5, ఏప్రిల్ 2009, ఆదివారం

తెంపరి

తెంపరి

భయంకర యంత్ర దంష్ట్రాలతో

భయభీకర రసాయనాలతో

ప్రాణాంతక విష వాయువులతో

విష సర్ప సదృశ విద్యుద్ఘాతాలతో

క్షణ క్షణం భయం భయం

ఒక్క క్షణం నిశ్శబ్దం

మరుక్షణం భయ భయ భీకర గర్జన

మసలుతున్న మరుగుతున్న

ద్రవ లోహపు ప్రేలుళ్ళవి

లోహ ప్రవాహాలను మాలుపుకొంటూ

ఘన లోహాలను మలచుకొంటూ

చెలిమి బాట వేసు కొంటూ

యంత్రాలను నియంత్రిస్తూ

రసాయనాయలను నియంత్రిస్తూ

విషవాయువులకు వేణువులూదుతూ

విద్యుద్ఘాతాల వీపు నిమురుతూ

దారి చూపు ఆ మనిషే

కార్మికుడు కష్ట జీవి

రచన :నూతక్కి రాఘవేంద్ర రావు. తేది: ౦౭-౦౪-2009

1, ఏప్రిల్ 2009, బుధవారం

అభ్యుదయం

నిశ్చలంగా మనసు
యోజనాలు పయనిస్తే
నిరంతరం సంచలిస్తూ
హ్రుదయం
యేకప్రాంత వాసిని
మనసుపొరలలో
జనిస్తుంది వుద్రేకం
హృదయాంత రాళాలలో
వుద్భవిస్తుంది వుద్వేగం
చంచల భావ జనిత వుద్రేకం
అచంచల భావోద్భవ
వుద్వేగాన్ని అధిరోహించి
సవారి చేసే అవకాశం
ఇవ్వ బోకు రానివ్వ బోకు
వుద్వేగాన్ని ఆవహింప చేసుకో
వుద్రేకాన్ని ఆవలికి నెట్టు
అదే అభ్యుదయం
రచన: నూతక్కి రాఘవేంద్ర రావు, తేది:02-04-09

8, మార్చి 2009, ఆదివారం

భాషా నిధనం ...సుస్వాగతం

మహొత్క్రుష్త మాత్రు భాషా నిధన కార్యక్రమం
.. సుస్వాగతం ..
రచన :నూతక్కి రాఘవెంద్ర రవు.
తెది 04-03-2009


ఈ భూమి పై పుట్టిన ప్రతి మనిషి , మానవ సమాజంలొ పెరిగే ప్రతి వ్యక్తికి ఆ సమాజపు భాష ,తద్వారా జీవన ప్రక్రియలొ జీర్నిచుకుపొయిన సంప్రదాయాలు,సంస్క్రుతులు,అలవాటులు ,ఆ జాతి జీవన చరితకు నిలువెత్తు దర్పణాలు.

సమాజానికి సంస్క్రుతి ,సంప్రదాయాలు ,రెందు నిట్టాళ్ళ లాటివివైతె .నీతి,నైపున్యం, నిబధత,ఆకాంక్ష అన్నవి నాలుగు మూల స్థభాలు. యీ భూమి పై మానవుడు సుఖంగ బ్రతకడానికి ముఖ్యంగ కావలసినవి,తింటానికి తిండి,కట్టుకోంద్కూ బట్ట,ఎండ, వానల నుంచి, జంతు జాలం నుంచి,రక్షణకై గూడు ,ఒకరి నుంచి ఒకరు అబిప్రాయాలు తెలుసుకొవడానికి సంకేతాలు ,సంకేతాలనుండి చేతి సఙ్గ్నలు,శబ్ద సంకేతాలు,ఆ శబ్ద సంకేతాలనుండి పదాలు,వాటి ద్వారా వాక్యాలు ,తద్వారా అక్షరాలు,మాటలు ,భాష,సంభాషణ,అక్కడితొ ఆగకుండా ,వ్రాత,రచన, సాహిత్యం,....ఆ విధంగా ,ఒక జాతి సంస్కృతి పై భాష,చాలా ప్రముఖ పాత్ర పొషిస్తుంది .

భాష సమాజాన్ని శాసిస్తుంది,భాష సమాజాన్ని పాలిస్తుంది, భాష సమాజాన్ని నియంత్రిస్తుంది ,భాష సమాజాన్ని బుజ్జగిస్తుంది,భాష సమాజాన్ని ప్రశ్నిస్తుంది,భాషే ప్రపంచాన్ని చూపిస్తుంది, వినిపిస్తుంది,ఆలోచింప చేస్తుంది .

భాష మానవునికి వున్న మహాధ్భుత వరం ,సౌకర్యం,మరి యే యితర జీవ రాశికి లేదన్న వాస్థవం మనందరకు తెలిసిన విషయమె,భాష పై అధి కారం సాధించిన వాళ్ళ్లు యే రంగంలోనయినా తమ దంటూ ఒక ప్రత్యేక స్థానం పొందగలుగుతారు.యే భాష పైనైనా అధికారం పొందగలిగిన వాడు తన మాత్రు భాషపై గొప్ప చాతుర్యం వున్న వాడై వుంటాడు.లెదా అదె భాషలొ బాల్యం నుంచి సాధన చేసైనా వుండి వుండాలి.

కాబట్టి మాత్రు భాషలొ ప్రావీన్యం వున్న తరువాతనె యే యితర భాషలయినా నేర్చు కొవచ్చు.అభిమానించ వచ్చు .జీవన అవసరార్థం వినియొగించుకొవచ్చు.మాత్రు భాష అంటె మాటొ వ్రాతో ఒక్కటొ,రెందో కాదు, సంప్రదాయానికి , సంస్క్రుతికి అనుసంధానించబడిన ఒక మహత్తర ప్రక్రియ.
మాత్రు భాష అలవడలేదంటే, ఆ సమాజంతో ఆమనిషికి సంపర్కం లేదన్న మాటె. అంతగా భాషా,సంప్రదాయం, సంస్క్రుతి, జీవన విధాన్నాల్లో ముప్పిరిగా పెన వెసుకు పోయి వుంటాయి.

తమ తమ సంస్క్రుతి సంప్రదాయాలు,సామాజిక విధి విధానాలు,తర తరాలకు అందించే భాధ్యత ఆ సమాజంలొ జన్మించిన ప్రతి ఒక్కరిది.దానికై సమాజంలొ గట్టి అనుబంధం అవసరం. ఆ అంబంధం ఆ సమాజంతొ యెవరూ విదదీయ లేరు.
అప్పుడే మాత్రు భాషపై పట్టు కలుగుతుంది ,సంస్క్రుతి సంప్రదాయాల యడల భక్తి కలుగుతుంది.తనకంటూ జీవన యానంలొ ఒక వునికి యేర్పడుతుంది. ఒక వ్యక్తిత్వం యెర్పదుతుంది.
యీ రొజున మాత్రు భాషాభిమానం ప్రజజీవనంలొ తరిగి పొతున్నదని పొలి కేకలు పెట్టే వాళ్ళే గాని,దానికి మూల కారణ మేమై వుంటుందన్న విషయమై ఆలొచించారా ఎన్నడయినా?

ఖుక్షి యనె రెందక్షరాల జీవ జాల యంత్రాంగం, మానవ జాతిని శాసిస్తున్నప్పుదు ,దాని అవసరాలు తీర్చే ప్రక్రియలొ మానవుడు యెన్నొ యెన్నెన్నొ
యత్నాలు, సాధనలు చేస్తూనే వుంటాడు.ఆకలి, పేదరికం, క్షుధ్భాధ వాటినివారనోపాయం వెదికే యత్నంలొ వుత్పాదితమయిన పరభాషా వ్యామొహాలు.అందునుంచి వుధ్భవించినవే భారత దేశంలో పరమత అభిమానాలు. అధికార యంత్రాంగాలు, తమ అధికారం నిలుపుకొనేందుకు చేసె మంత్రాంగాలు ప్రక్కన బెట్టి యీ సమస్యా మూలాల గూర్చి ఆలొచిస్థే పరిష్కారానికి మూలం తెలుసుకొని ఆ కోణంనుంచి సామాన్యలకు వుపశమనం దొరికినప్పుడు, అప్పుడు వాళ్ళు మాత్రు భాషపై ద్రుష్టి మరల్చె అవకాసం వుంటుంది.

ఆదీ కాకుందా చాందస భావాల మధ్య ,చందొ బధ్ధ బంధనాలలొ భాష యెప్పుడొ బందీ అయిపొయింది. ధనవంతులు,విద్యా వంతులు యే ప్రాంతంలొని వారయినా మాత్రు భాష మాట్లాడటమే తప్పుగా భావించడం ప్రారంభమయి యెన్నో దశాబ్దాలయి పొయింది.

ఇక యే పండితు డయినా ఆయా ప్రాంతాలలొ మాత్రు భాషను వెదకాలంటె ఆ మహా రాజ పొషకులు,భాషామ తల్లికి ముడ్డు బిడ్డలు వారే వారే, పేదలు నిరుపేదలు, సామాన్యులు,చదువు కోనివారు చదువుకొన లేని వారు,గుడిసెల్లొ , రొడ్లవెంబడి,కాలవ గట్లన మురికివాదలొ, ఎక్కడ బడితె అక్కడ వారె.... ,వారికి మాత్రు భాష తప్ప మరే భాషా రాదు. వారు మాత్రు భాషా ద్రొహం చేయలేరు.వారికి పేదరికం లో కొట్టు మిట్టాడటమే తెలుసు.వారే దేశం లో అత్యధికులు. వారి వల్లనే భారత దేశంలొ ఆయా మాత్రు భాషలు బ్రదుకు నీడుస్తున్నాయి.


ఆయ్యా! మాత్రు భాషాభి మ్రానుల్లారా,భాషా పందిత ప్రవరాఖ్యుల్లారా,భాషా ఛాందస వాద కుయుక్తుల్లారా......

ఒహొ ఇందులొ మీదే కద ప్రధమ భాగం ఒ రజకీయులారా ....
వొటే మీ భాష ఒటే మీ మాట ఒటే మీ బ్రతుకు ఒటే మీ ఉశ్చం
నీచం,ఒటే మీ తుస్చ జీవనం.అయినా ఆఆ భాషలొనే పుత్తి, ఆ భాషా జన జీవనాల బక్షిస్తూ బ్రథికేసే రాజకీయ ......విష చత్ర చాయలో... .


మాత్రు భాషా నిధనానికై ప్రతిగ్న చేసినట్లున్నాయి ప్రభుత్వాలు .
ఖాల్మొక్త బాంచ్న్ దొరా
మేమే బాబూ బాస బతికించేది,
మాకూ తిండి ,బాబూ మాకూ బట్ట,
బాబూ మాకూ గూడూ...
మాకూ సదువు,మాకూ జీతం.
బత్తెం ఇచ్చెయ్యండయ్యొ
నీ కాల్మొక్తా బాంచెన్ దొరా,
మేమూ ఇంగిలిపీసే మాత్తాడేత్తామయ్యా,
నీ కాల్మొక్తా బాంచన్ దొరా!
మాత్రు బాసను సంపేద్దామండయ్యొ
నీకాల్మొక్తా బాంచన్ దొరా..

రచన : నూతక్కి రాఘవేంద్ర రావు.dt04-03-2009,